బెంగాలీ నటి బ్యూటీ రితభరీ చక్రవర్తి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈమె అందానికి, అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు.
మొదట నేకేడ్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇక సినిమాలలో తన అందం అభినయం నటనతో ప్రేక్షకులను అలరించింది.అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ అనుష్క శర్మతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఆ తర్వాత కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బ్రోకెన్ ఫ్రేమ్ అనే షార్ట్ ఫిలిం తో పాటు మరొక హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.
ఇక ఆమె నటిస్తున్న సదరు హిందీ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.
ఇక సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి బాలీవుడ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.పరి సినిమా తరువాత దాన్ని మించిపోయే పాత్రలే చేయాలని అనుకున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలోనే తన దగ్గరకు వచ్చిన ఎన్నో అవకాశాలను చేజేతులా పోగొట్టుకున్నట్లు ఆమె తెలిపింది.ఇక ఒకసారి అయితే ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత అందులో నుంచి ఆమెను తప్పించారని, ఆ సినిమాలో ఆమె మురికివాడల్లో నివసించే అమ్మాయిగా కనిపించడం కోసం దాదాపుగా 12 కిలోల బరువు తగ్గాను అని చెప్పుకొచ్చింది.
కానీ చివరి నిమిషంలో ఆ సినిమా డైరెక్టర్ ఆ సినిమా నుంచి ఆమెను తప్పించి వేరే వారిని తీసుకున్నారు అని ఆమె తెలిపింది.ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది.ఇక గత ఏడాది రెండు సర్జరీలు అయ్యాయని, అప్పుడు బెడ్ పైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ సమయంలో ఆమె ఎవరితో కూడా కాంటాక్ట్ లో లేను అని, కానీ కొద్దికాలం తర్వాత మళ్లీ బాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ అందరితో మళ్లీ కనెక్ట్ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది రితభరి.