డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన సాయిరాం శంకర్ ఇప్పటి వరకు ఒక్క బిగ్ కమర్షియల్ సక్సెస్ను అందుకోలేక పోయాడు.ఈయన హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు.
అవి కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు.అయినా ఈయన పట్టు వదలని విక్రమార్కుడిగా సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.
తాజాగా ఈయన ‘వాడు నేను కాదు’ అనే సినిమాను ప్రారంభించాడు.
ఈ కొత్త సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఈయన ఉన్నాడు.
ఎందుకంటే ఈ సినిమా నుండి తన పేరును మార్చుకున్నాడు.ఇప్పటి వరకు సాయిరాం శంకర్గా ఉన్న తన పేరును ఇకపై సాయి తొలగించి కేవలం రాం శంకర్గా మాత్రమే వేయించుకోనున్నాడు.
న్యూమరాలజీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సాయిరాం శంకర్.సారీ రామ్ శంకర్ చెప్పుకొచ్చాడు.
మరి పేరు మార్చుకున్న ఈయనకు లక్కు మారి సక్సెస్ను తెచ్చి పెట్టేనా చూడాలి.శరవేగంగా ‘వాడు నేను కాదు’ సినిమాను పూర్తి చేసి మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని రామ్ శంకర్ చెప్పుకొచ్చాడు.