టాలీవుడ్కు చెందిన మంచు ఫ్యామిలీకి రాజకీయాలతో దగ్గర సంబంధం ఉంది.మంచు మోహన్బాబు గతంలో ఎంపీగా కూడా చేసిన విషయం తెల్సిందే.
దాంతో ఆయనకు కేంద్రం స్థాయిలో పలువురు సీనియర్ నేతలు పరిచయాలు ఉన్నాయి.ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా హైదరాబాద్కు వచ్చిన నరేంద్ర మోడీతో మోహన్బాబు కుటుంబ సభ్యులు భేటీ అయిన విషయం తెల్సిందే.
మోహన్బాబు ఫ్యామిలీ నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు.తాజాగా మరోసారి మంచు ఫ్యామిలీ నరేంద్ర మోడీని కలవడం జరిగింది.
ప్రస్తుతం పార్లమెంట్ జరుతున్న విషయం తెల్సిందే.పార్లమెంటులోనే మోడీని కలవాలని మంచు ఫ్యామిలీ పార్లమెంటుకు చేరుకున్నారు.
మంచు మోహన్బాబు కొడుకులు, కూతురుతో పాటు వెళ్లడం జరిగింది.వీరికి ఇప్పటికే మోడీ అపాయింట్మెంట్ దక్కిందని తెలుస్తోంది.
ఇంత బిజీ షెడ్యూల్లో మంచు ఫ్యామిలీకి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.త్వరలో మంచు మనోజ్ పెళ్లి ఉన్న విషయం తెల్సిందే.
ఆ వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు మోడీని మంచు ఫ్యామిలీ కలిసి ఉండవచ్చు అనే ఊహాగాణాలు వస్తున్నాయి.