ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు( Kalava Srinivasulu ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏపీ నుంచి పారిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్న కాల్వ శ్రీనివాసులు జాకీ పరిశ్రమ, కియా అనుబంధ పరిశ్రమలు తరలిపోయాయని పేర్కొన్నారు.ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన( TDP , Janasena ) కూటమి అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.