తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.గ్రూప్ -1 లో పోస్టుల( Group-1 ) సంఖ్యలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే సుమారు 60 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి( TSPSC ) ఆదేశాలు జారీ చేసింది.
అయితే గతంలో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.తాజాగా 60 పోస్టులకు ఆమోదం తెలపడంతో ఆ సంఖ్య 563 కు పెరిగింది.
కాగా గ్రూప్ -1 లో 19 విభాగాల్లో 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం గతేడాది జూన్ 11 న ప్రిలిమ్స్ రాత పరీక్షను నిర్వహించింది.ఈ పరీక్షకు దాదాపు 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా.పేపర్ లీకేజీ వ్యవహారంతో దుమారం చెలరేగింది.
అనూహ్య పరిణామాల నేపథ్యంలో గ్రూప్ 1 తో పాటు పలు పరీక్షలను హైకోర్టు రద్దు చేసింది.ఆ తరువాత మరోసారి గ్రూప్ 1 పరీక్షను నిర్వహించగా.
అది కూడా రద్దయిన సంగతి తెలిసిందే.