కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ ( Manoj ) తాప్సీ జంటగా నటించిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పరవాలేదు అనిపించుకోవడంతో ఈమెకు తెలుగులో ఇతర హీరోల సరసన కూడా నటించే అవకాశాలు వచ్చాయి.
ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించినటువంటి అనంతరం తమిళ భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.ఇక 2016వ సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పింక్ ( Pink ) చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.
ఇప్పటికీ తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్లినటువంటి ఈమె తిరిగి తెలుగు సినిమాలలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు దీంతో ఈమె ఎక్కడికి వెళ్ళినా టాలీవుడ్ సినిమాల ( Tollywood Movies ) గురించి ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.తెలుగులో నటించిన అభ్యంతరాలు లేదు కానీ సినిమా అవకాశాలు రాకపోతే నేనేం చెయ్యను.వచ్చిన అవకాశాలలో కూడా పెద్దగా కథ ప్రాధాన్యత లేకపోవడంతో రిజెక్ట్ చేశానని ఈమె తెలిపారు.
తన వద్దకు వచ్చిన సినిమాలన్నింటికీ తాను ఎప్పుడు కమిట్ అవ్వనని కథ నచ్చకపోతే నేను అసలు నటించను అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు సరైన కథ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాల గురించి మాట్లాడుతూ చిన్న సినిమాలలోనే తనకు చాలా తృప్తిగా నటించాను అన్న భావన ఉంటుందని తెలిపారు.ఇలాంటి సినిమాలలో మొత్తం ప్రాధాన్యత నాకే సంతరించుకొని ఉంటుంది కనుక డబ్బులు తక్కువ అయినా తాను ఇలాంటి సినిమాలలోనే నటిస్తున్నానంటూ ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడం గురించి కూడా కామెంట్స్ చేశారు.