ఈనెల 26న చేవెళ్ల సభకు తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేవెళ్లలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.సభా వేదికపై నుంచి ఎస్టీ, ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించనున్నామని తెలిపారు.

 Revanth Reddy's Call To Come To Chevella Sabha On 26th Of This Month-TeluguStop.com

వికారాబాద్ జిల్లాకు గోదావరి జలాలను కేసీఆర్ తీసుకురాలేదని విమర్శించారు.వికారాబాద్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రసాద్ ను గెలిపించాలన్నారు.ఎస్టీ, ఎస్టీల నిధులు దారి మళ్లించారని ఆరోపించిన రేవంత్ రెడ్డి బీసీ మంత్రి ఈటల రాజీనామా చేస్తే ఆ పదవి ఓసీకి ఇచ్చారని విమర్శించారు.119 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులా అని ప్రశ్నించారు.అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి నాలుగు మంత్రి పదవులా అని నిలదీసిన ఆయన ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు.

తెలంగాణలో సామాజిక న్యాయం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube