తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేవెళ్లలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.సభా వేదికపై నుంచి ఎస్టీ, ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించనున్నామని తెలిపారు.
వికారాబాద్ జిల్లాకు గోదావరి జలాలను కేసీఆర్ తీసుకురాలేదని విమర్శించారు.వికారాబాద్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రసాద్ ను గెలిపించాలన్నారు.ఎస్టీ, ఎస్టీల నిధులు దారి మళ్లించారని ఆరోపించిన రేవంత్ రెడ్డి బీసీ మంత్రి ఈటల రాజీనామా చేస్తే ఆ పదవి ఓసీకి ఇచ్చారని విమర్శించారు.119 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులా అని ప్రశ్నించారు.అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి నాలుగు మంత్రి పదవులా అని నిలదీసిన ఆయన ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు.
తెలంగాణలో సామాజిక న్యాయం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమని స్పష్టం చేశారు.