ప్రకాశం జిల్లాలో టూరిస్టులకు పెను ప్రమాదం తప్పింది.ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది.
జిల్లాలోని కొమరోలు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కాగా ఘటన చోటు చేసుకున్న సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
భోపాల్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.