ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారమే ధ్యేయంగా బీజేపీ కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా పార్టీతో భారీ మార్పులు చేస్తుంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మార్చిన బీజేపీ అధిష్టానం తాజాగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్ లను ప్రకటించింది.ఈ మేరకు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకు ఇంఛార్జ్ లను నియమించింది.
ఇందులో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ గా ప్రకాశ్ జవదేకర్, సహా ఇంఛార్జ్ గా సునీల్ బన్సల్ నియామకం అయ్యారు.రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇంఛార్జ్ గా ప్రహ్లాద్ జోషి, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇంఛార్జ్ గా ఓం ప్రకాశ్ మాథుర్ తో పాటు మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇంఛార్జ్ గా భూపేంద్ర యాదవ్ ను నియమించింది.