సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తే భయభ్రాంతులకు గురి కావాల్సిందే.మనిషి విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ నరరూప రాక్షసుల మారుతున్నాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఓ వ్యక్తి తన భార్య ప్రేమికుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి, ఆ వ్యక్తి రక్తం ( Blood ) తాగిన ఘటన కర్ణాటకలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో చూసే వారంతా భయపడి ఆశ్చర్యపోయారు.
ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.
కర్ణాటకలోని( Karnataka ) చింతామణి జిల్లాకు చెందిన విజయ్ ( Vijay ) చిక్కబల్లాపూర్ లో కూరగాయలు, బట్టల వ్యాపారం చేసి జీవనం సాగించేవాడు.అయితే వ్యాపారం చేయడానికి ఒక వాహనం అవసరం ఉండగా అదే ప్రాంతానికి చెందిన మారేష్ అనే వ్యక్తికి చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకొని సరుకులు రవాణా చేసేవాడు.
ఈ క్రమంలో మారేష్ అప్పుడప్పుడు విజయ్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు.ఇక విజయ్ భార్యకు, మహేష్ కు మధ్య పరిచయం పెరగడంతో తరచూ ఇంటికి రావడం ప్రారంభించాడు.
ఇక విజయ్ భార్యతో మారేష్ గంటల తరబడి మాట్లాడేవాడు.ఈ విషయం విజయ్ కు తెలియడంతో మారేష్ తో గొడవపడి తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు.
ఇక భార్యకు కూడా మారేష్ తో మాట్లాడకూడదు అని కండిషన్ పెట్టాడు.
అయితే విజయ్ భార్యలో కానీ, మారేష్ లో కానీ మార్పు రాలేదు.విజయ్ మాటలను పెడచెవిన పెట్టి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కొనసాగించడంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.ఇక విజయ్, మారేష్ కు ఫోన్ చేసి సరుకులు రవాణా చేయాల్సి ఉందంటూ ఒక నిర్మానుష ప్రాంతానికి పిలిచాడు.
అలాగే జాన్ అనే బంధువును కూడా విజయ్ తన వెంట తీసుకువెళ్లాడు.
అక్కడ విజయ్, మారేష్ల మధ్య వాగ్వాదం జరిగింది.ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ తన వద్ద ఉన్న కత్తితో మారేష్ గొంతు కోశాడు.ఆ తర్వాత మారేష్ రక్తం త్రాగుతూ ఈ తతంగాన్ని అంతా ఫోన్లో రికార్డు చేయాలని తన బంధువైన జాన్ ను కోరాడు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో చివరికి పోలీసుల దృష్టికి చేరింది.పోలీసులు తీవ్రంగా గాయపడిన మారేష్ ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చి నిందితుడు అయిన విజయ్ ని అరెస్టు చేశారు.