మనిషికి పునర్జన్మ ఉంటుందా అంటే కొంతమంది ఉంటుంది అంటే.మరికొంతమంది మనిషికి ఒకే జన్మ అంటూ ఉంటారు.
అయితే ప్రస్తుతం మనిషికి పునర్జన్మ ఉందా లేదా అనే విషయంలో స్పష్టమైన సమాధానం ఎక్కడా లేదు.ఇది ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
అయితే అప్పుడప్పుడు కొందరు తాము మళ్లీ పుట్టామని, ఈ జన్మ వారికి పునర్జన్మ అని చెబుతూ గతంలో జరిగిన విషయాలను పూస గుచ్చినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారని చాలామంది వినే ఉంటారు.ఇలాంటి కోవకు చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh )లో చోటుచేసుకుంది.
ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
ఉత్తరప్రదేశ్లోని మైన్పూర్( Mainpur in Uttar Pradesh ) జిల్లాలో ఎలావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మంగల్ పూర్ గ్రామంలో 8 ఏళ్ల కుర్రాడు తాను మళ్లీ జన్మించాలని ఇది తనకు పునర్జన్మ అంటూ అందరినీ ఆశ్చర్యపరచాడు.జూన్ 15న 8 ఏళ్ల ఆర్యన్( Aryan ) తన తల్లితో పాటు అమ్మమ్మ గ్రామమైన రతన్ పూర్ గ్రామానికి వెళ్ళాడు.అక్కడ అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టమని ఆర్యన్ కు తల్లి చెప్పింది.
అందుకు ఆ పిల్లాడు ఆమె నా భార్య అని, మేనమామను తన కుమారుడు అని తల్లికి తెలిపాడు.చిన్న పిల్లాడు కదా సరదాగా చెప్పాడని అందరూ తేలికగా తీసుకున్నారు.
కానీ ఆర్యన్ పదేపదే ఇవి విషయాలు చెప్పి అందరిని విసిగించాడు.ఎవరు నమ్మకపోవడంతో గతంలో కుటుంబంలో జరిగిన అన్ని సంఘటనలు పూసగుచ్చినట్లు చెప్పి కుటుంబ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచాడు.
తన పేరు మనోజ్ మిశ్రా( Manoj Mishra ) అని 8 ఏళ్ల క్రితం.2015 జనవరి 9న తాను పొలంలో పనిచేస్తున్న సమయంలో ఒక రంద్రం కనిపించిందని, ఆ రంద్రాన్ని మూసే ప్రయత్నం చేయగా పాము కరిచిందని, వెంటనే తాను సృహ కోల్పోతే ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా దారి మధ్యలోనే తాను ప్రాణాలు విడిచానని తెలిపారు.అంతేకాకుండా తాను చనిపోయే సమయంలో తన కుమార్తె(ఆర్యన్ తల్లి) గర్భిణిగా ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఇక తన అంత్యక్రియలు, అన్ని కర్మలు ముగిసిన తర్వాత తన కుమార్తె రంజన కు తాను కుమారుడిగా జన్మించాలని తెలిపాడు.
ఆర్యన్ మేనమామ అజయ్ మాట్లాడుతూ ఆర్యన్ కు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి గత జన్మ విషయాలు చెబుతున్నాడని, తాము ఎప్పుడు ఆర్యన్ మాటలను సీరియస్ గా తీసుకోలేదని తెలిపాడు.ఇక ఆర్యన్ నానమ్మ నీరజ్ మిశ్రా కూడా ఈ పిల్లాడు చెప్పే మాటలన్నీ నిజమే అని తెలిపింది.
ఈ విషయం బయటికి రావడంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోతున్నారు.