సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ జరగనుంది.ఈనెల 11న జరిగే ఈ మార్చ్ కు ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి రావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అదేవిధంగా నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం అందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.కాగా నిరుద్యోగ మార్చ్ కు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారని సమాచారం.