ఏపీ రాజకీయాల్లో రజనీకాంత్( Rajinikanth ) వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇటీవల విజయవాడ వేదికగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.చంద్రబాబు ముందుచూపు గల వ్యక్తి అని, ఆయన విజన్ కారణంగానే హైదరాబాద్ న్యూయార్క్ గా ఇప్పుడు వెలుగొందుతోంది అని, ఆయన ఏపీలో అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని అనేక పొగడ్తలతో ముంచేస్తారు.
ఈ వ్యవహారం తరువాత వైసిపికి ఆయన పూర్తిగా టార్గెట్ అయిపోయారు.ముఖ్యంగా మంత్రులు ఆర్కే రోజా తో పాటు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వంటి వారు రజినీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇక తరచుగా ఆర్కే రోజా రజిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) సైతం ఈ వ్యవహారంపై స్పందించి రజనీకాంత్ కు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే ఈ వ్యవహారంపై చంద్రబాబు రజినికాంత్ కూడా ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు.ఇక రజిని ఫాన్స్ రోజా పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
రజిని విమర్శించే అంత స్థాయి రోజాకు లేదని ,వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరికలు చేస్తున్నారు.తాజాగా పుదుచ్చేరిలో ఓ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన రోజా ఈ సందర్భంగా రజినీకాంత్ పై విమర్శలు చేశారు.
రజనీకాంత్ జీరో అంటూ విమర్శించారు.తిరు కంచి గంగై వరదరాజు నాదీస్వర ఆలయంలో పుష్కరిని ఉత్సవాలు పాల్గొనేందుకు వెళ్లిన రోజా రజిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.రజనీకాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారని, రజనీకాంత్ ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో ఆయన జీరో అయ్యారని విమర్శించారు.రజినీకాంత్ ఇంతకాలంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఆ వ్యాఖ్యలతో పోగొట్టుకున్నారని రోజా ( RK Roja )విమర్శించారు.
అసలు రాజకీయాలే వద్దు అనుకున్న రజనీకాంత్ మళ్లీ ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారంలో రజనీకాంత్ కూడా ఉన్నారని, చంద్రబాబు చేసిన అరాచకం అంతా రజినీకాంత్ కు తెలుసునని విమర్శించారు.ఈ వ్యాఖ్యలపై రజిని ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.రజినిపై మరోసారి ఇటువంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ రోజాను హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో .?
.