విజయవాడలో కాపు నేతల భేటీ వార్తలపై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు.స్నేహ పూర్వకంగా జరిగిన సమావేశాన్ని వక్రీకరిస్తున్నారన్నారు.
ఇలాంటి వార్తలతో కొందరు వైసీపీ నేతలకు నిద్ర కూడా పట్టదని విమర్శించారు.ఇది సాధారణ సమావేశమన్న ఆయన రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.
ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా కలిశామని తెలిపారు.విశాఖలో కాపునాడు సమావేశంపై చర్చ రాలేదని వెల్లడించారు.
పార్టీ మారే అంశాన్ని గతంలోనే ఖండించానని గంటా చెప్పారని పేర్కొన్నారు.కన్నా కూడా నాదెండ్లతో వ్యక్తిగత సంబంధాలతో కలిశామన్నారు.
కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.