జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ ముగిసింది.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో పవన్ పై ప్రభుత్వ తీరు సరికాదన్నారు.
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ విశాఖ వెళ్తే ఆయన పట్ల దారుణంగా వ్యవహరించారని అన్నారు.పవన్ వెళ్తుంటే రోడ్లు లైట్స్ అన్ని ఆర్పేశారని.
ఉన్నాది పాలనలో ఇలాంటి తప్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు .పవన్ కు విశాఖ వెళ్లేందుకు అర్హత లేదా అని, పవన్ వల్ల ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.వైసిపి వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆరోపించారు.నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ ఉంటుందన్నారు.తమపై దాడులు చేసే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని, మనుషులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు.ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిందని చంద్రబాబు తెలిపారు.