జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశం అయ్యారు.విశాఖలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నారు.
విశాఖ నుంచి విజయవాడకు వచ్చిన పవన్ మరో రెండు, మూడు రోజులపాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండనన్నారు.విశాఖ ఘటనల నేపథ్యంలో జన సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు మంగళగిరి పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.