పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.కొమరాడ మండలం కల్లికోటలో విధ్వంసం చేశాయి.
ఓ బైకుతో పాటు చిన్న దుకాణాన్ని కూడా గజరాజులు ధ్వంసం చేశాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఏనుగుల మంద ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఏనుగులు గ్రామాల్లో బీభత్సం చేస్తున్నా.
అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి గజరాజుల దాడుల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.