ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు అయింది.ఆయనకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
మహ్మాద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పోలీసులు రాజాసింగ్ ను నాంపల్లి కోర్టులో హాజరపరిచారు.దీంతో ఆయన తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారన్న న్యాయవాది వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.