మెగా కోడలు ఉపాసనకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.సినిమాలతో సంబంధం లేకపోయినా చరణ్ భార్య కావడంతో ఉపాసనను అభిమానులు ఎంతగానో అభిమానిస్తున్నారు.
అయితే తాజాగా ఉపాసన పిల్లల్ని కనడం గురించి సద్గురుతో చెప్పించిన సమాధానాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.వంశాంకురంను కోరుకోవడంలో తప్పు లేదని గీతాకృష్ణ తెలిపారు.
ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు ఆలస్యంగా పిల్లల్ని కనాలని భావిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.ఇది ఈతరం కాన్సెప్ట్ అని ఆయన తెలిపారు.
చరణ్ ఉపాసన జనాభాను నియంత్రించడానికి అలాంటి నిర్ణయం తీసుకోవాలా అని గీతాకృష్ణ ప్రశ్నించారు.ఆ నిర్ణయం నాన్సెన్స్ నిర్ణయమని ఆయన కామెంట్లు చేశారు.
పూరి గుడిసెలో ఉన్నవాళ్లు అయినా పెళ్లి జరిగితే బిడ్డ పుట్టాలని కోరుకుంటారని గీతాకృష్ణ పేర్కొన్నారు.
కుటుంబంలో గర్భం గురించి అడగటం సాధారణమని ఆయన తెలిపారు.
సద్గురును ఉపాసన అలా అడగటం నాకు నచ్చలేదని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి, చరణ్ స్టార్స్ అని తమ ఇంట్లో కూడా పిల్లల్ని కనాలని ఒత్తిడి ఉందని ఆమె చెప్పారని గీతాకృష్ణ తెలిపారు.నేను అన్ని విషయాల గురించి మాట్లాడగలనని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.ఉపాసన డైరెక్ట్ గా కూడా ఈ విషయాలను చెప్పవచ్చని ఆయన తెలిపారు.
వంశాకురం, వంశవృక్షంను కోరుకోవడం తప్పు కాదని ఆయన తెలిపారు.సద్గురు చెప్పిన విషయాలను తాను ఖండిస్తున్నానని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.గీతాకృష్ణ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఉపాసన ప్రస్తుతం పలు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే అపోలో సంస్థ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు.చరణ్ కెరీర్ లో సక్సెస్ కావడంలో ఉపాసన పాత్ర ఎంతో ఉంది.చరణ్ ఉపాసన టాలీవుడ్ క్యూట్ జోడీలలో ఒక జోడీ కావడం గమనార్హం.