విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ జీవితం యువతకు స్ఫూర్తినిస్తుంది.అజీమ్ ప్రేమ్జీ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త, అతనిని ఘనమైన దాత అని కూడా అభివర్ణిస్తారు.
అతని కృషి కారణంగానే ఈరోజు విప్రో పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.అజీమ్ ప్రేమ్జీ 24 జూలై 1945న ముంబైలోని నిజారీ ఇస్మాయిలీ షియా ముస్లిం కుటుంబంలో జన్మించారు.
వారి పూర్వీకులు ప్రధానంగా కచ్ (గుజరాత్) నివాసితులు.అతని తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త.ఆయన ‘రైస్ కింగ్ ఆఫ్ బర్మా’గా పేరొందారు.భారతదేశం- పాకిస్తాన్ విభజన తరువాత, ముహమ్మద్ అలీ జిన్నా.అజీమ్ ప్రేమ్జీ తండ్రిని పాకిస్తాన్ రావాలని ఆహ్వానించాడు.
కానీ అతను తిరస్కరించాడు.భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.1945లో అజీమ్ ప్రేమ్జీ తండ్రి మహమ్మద్ హషీమ్ ప్రేమ్జీ మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ‘వెస్ట్రన్ ఇండియన్ వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ని స్థాపించారు.ఈ కంపెనీ ‘సన్ఫ్లవర్ వనస్పతి’, లాండ్రీ సబ్బు ‘787’ తయారు చేసేది.అతని తండ్రి.ప్రేమ్జీని ఇంజినీరింగ్ చదవడానికి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి పంపాడు.అయితే దురదృష్టవశాత్తు అతని తండ్రి ఈలోగానే మరణించాడు.
దీంతో అజీమ్ ప్రేమ్జీ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.అప్పటికి అతని వయసు కేవలం 21 సంవత్సరాలు.
దీని తర్వాత కూడా అతను ధైర్యాన్ని వదులుకోకుండా, కష్టపడి విప్రోను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు.
నేడు విప్రో బహుళ వ్యాపార, బహుళ జాతీయ సంస్థగా మారింది.వినియోగదారు ఉత్పత్తులు, మౌలిక సదుపాయాల మెకానిక్స్ నుండి ప్రత్యేక సమాచార సాంకేతిక ఉత్పత్తులు, సేవల వరకు విప్రో సేవలు విస్తరించాయి.ఆసియా వీక్ మ్యాగజైన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 20 మంది వ్యక్తుల జాబితాలో ప్రేమ్జీ పేరు వినిపిస్తుంది.
టైమ్ మ్యాగజైన్ అతనిని ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో చేర్చింది.నేడు విప్రో ప్రపంచంలోని టాప్ వంద సాఫ్ట్వేర్ ఐటి కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది.