మార్కెట్లో ఎన్నో రకాల సోప్స్ అందుబాటులో ఉన్నాయి.కానీ, వాటిల్లో బోలెడన్ని కెమికల్స్ నిండి ఉంటాయి.
అటు వంటి సోప్స్ను వాడటం వల్ల చర్మం కఠినంగా మారిపోతుంటుంది.అందుకే ఇంట్లో చేసుకున్న సోప్స్ను వాడటానికే ప్రయత్నించాలి.
సోప్ తయారు చేసుకోవడం కష్టమైన పనేమి కాదు.షాప్స్లో దొరికే సోప్ బేస్ తెచ్చుకుని మనకు నచ్చినట్లు సబ్బులను చేసుకోవచ్చు.
ముఖ్యంగా పసుపుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా సోప్ తయారు చేసుకుని ప్రతి రోజు వాడితే గనుక వివిధ రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.మరి లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా నాలుగైదు ఎండిన పసుపు కొమ్ములను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే.
దానిపై మరో గిన్నె పెట్టుకుని అందులో సోప్ బేస్ వేసి డబుల్ బాయిలర్ మెథడ్లో కరిగించాలి.
సోప్ బేస్ కరిగిపోగానే అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పసుపు ఒక స్పూన్ వేసి బాగా కలిపి రెండు నిమిషాల అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో నాలుగు చుక్కలు శాండిల్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ను మిక్స్ చేయాలి.ఆపై చిన్న చిన్న బాక్సుల్లో వేసి రెండు గంటల పాటు వదిలిస్తే పసుపు సోప్ సిద్ధమైనట్లే.
ప్రతి రోజు పసుపుతో తయారు చేసుకున్న ఈ సోప్ను వాడటం వల్ల చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు ఉంటే పరార్ అవ్వడమే కాదు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.చర్మం ప్రకాశ వంతంగా మారుతుంది.స్కిన్ టోన్ మెరుగు పడుతుంది.మరియు చర్మం ఆరోగ్య వంతంగా కూడా తయారు అవుతుంది.