గతంలో చెంగల్ పట్టు జిల్లా మహాబలిపురం వద్ద సినీనటి యాషిక ఆనంద్ కు కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.అందులో తనతో పాటు తన స్నేహితులు కూడా ఉండగా తన స్నేహితురాలు పావని అనే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మరణించింది.
ఇక యాషికకు కూడా కొన్ని గాయాలు అవగా తను ఓ కార్పొరేషన్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా యాక్సిడెంట్ తర్వాత యాషిక స్పందించింది.
తొలిసారిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన యాషిక ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తమిళ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని అభిమానులకు మరింత దగ్గరైంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఇక తనకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది.
దాదాపు నెల రోజుల నుంచి హాస్పిటల్ కే పరిమితమైన యాషికా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా మళ్ళీ అడుగులు పెడుతుంది.తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ ఫోటో పంచుకుంది.
అందులో మై స్ట్రెంత్ అంటూ ఫోటోని షేర్ చేయగా అందులో తన పక్కన ఒక మహిళ మరో పక్కన తన కుక్కతో కనిపించింది.ఇందులో తన కాళ్లకు రెండు కట్లు కూడా కట్టి ఉండగా యాషిక కాస్త కుదుట పడినట్లు కనిపించింది.
అంతేకాకుండా చాలా సన్నగా కూడా కనిపించింది.ఇక ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఆమె ఫోటో చూసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.