తెలుగు, తమిళ భాషలలో తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ గాయని “చిన్మయి శ్రీపాద” గురించి తెలుగు పరిశ్రమలో తెలియని వారు ఉండరు.అయితే సింగర్ చిన్మయి కేవలం పాటలు పాడడం మాత్రమే కాకుండా సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మరియు లైంగిక వేధింపులు వంటి వాటిని అరికట్టేందుకు పోరాటం చేస్తోంది.
అలాగే ఆ మధ్య కరోనా వైరస్ కారణంగా రోడ్డు పడిన ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా మరియు ఆహార పదార్థాలను సప్లై చేయడం వంటివి చేస్తూ బాగానే ఆదుకుంది.
కాగా ఆ మధ్య ఓ యువతి తన ఇంట్లో ఆడపిల్లకి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దాంతో తన అన్నయ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బాగా చదివించాలని కానీ తను మాత్రం చిన్నచూపు చూస్తున్నారని సింగర్ చిన్మయి కి మెసేజ్ చేసింది.
దీంతో చిన్మయి అవన్నీ పట్టించుకోకుండా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించమని యువతికి సూచించింది.దీంతో యువతి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నట్లు తెలిపింది.
దీంతో సింగర్ చిన్మయి చాలా సంబరపడి పోయింది.అంతే కాకుండా ఈ విషయాన్ని అందరికి తెలియజేస్తూ ఆడపిల్ల చదువుకుంటే కుటుంబానికి ఎంతో ఉపయోగకరమని తెలియజేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఓ విద్యార్థి కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండగా సింగర్ చిన్మయి దాదాపుగా 27 వేల రూపాయలు కాలేజీ ఫీజు కట్టింది.దాంతో ఆ విద్యార్థి కూడా ప్రస్తుతం బాగా చదువుకొని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.దీంతో విద్యార్థి సింగర్ చిన్మయి చేసిన మేలుని ఈ జన్మలో మర్చిపోలేనని అంతేకాకుండా తాను కష్టాల్లో ఉన్నప్పుడు చిన్మయి సహాయం చేశారని దాంతో తాను కూడా ప్రతి నెల వచ్చేటువంటి జీతంలో కొంత మొత్తాన్ని కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసేందుకు ఉపయోగిస్తానని తెలిపాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా సింగర్ చిన్మయి చేసిన ఈ మంచి పనులను నెటిజన్లు అభినందిస్తున్నారు.