తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా నీ ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పాటు తనిఖీలకు వెళ్ళిన క్రమంలో ఘర్షణల ఘటనలు చోటు చేసుకోవడంతో దేవినేని ఉమా వర్సెస్ వైసీపీ అన్న తరహాలో వివాదం నెలకొంది.
పరిస్థితి ఇలా ఉండగా దేవినేని ఉమా పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించడం జరిగింది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ అరెస్టునీ ఖండించడం మాత్రమే కాక జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుదేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించి నేరుగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పటం కూడా జరిగింది.ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సీఎం వైఎస్ జగన్ కి పరిపాలన చేతకాదని, ప్రత్యర్థుల పై అక్రమ కేసులు పెడుతూ పరిపాలన గాలికొదిలేశారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా దేవినేని ఉమా కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో సంతోషం నెలకొంది.కృష్ణాజిల్లా జీ.కొండూరు పోలీస్ స్టేషన్ లో దేవినేని ఉమా పై కేసులు నమోదయ్యాయి.