పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నేడు జీ తెలుగు లో టెలికాస్ట్ కు సిద్దం అయ్యింది.సాయంత్రం 6 గంటల సమయంలో టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా వారం రోజుల క్రితం ప్రకటించారు.
అప్పటి నుండి ఈ సినిమా కోసం బుల్లి తెర ప్రేక్షకులు వెయిట్ చేస్తూనే ఉన్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న వకీల్ సాబ్ ను థియేటర్లలో జనాలు కరోనా సెకండ్ వేవ్ కారనంగా చూడలేక పోయారు.
కొందరు అమెజాన్ లో చూసినా కూడా ఎక్కువ శాతం మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇంకా వకీల్ సాబ్ ను చూడలేక పోయారు.వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి అభిమానులు సినిమా ను ఆహా ఓహో అంటూ తెగ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నేపథ్యంలో ఆ ప్రచారం ఇంకా కూడా మారు మ్రోగిపోతూనే ఉంది.
ఇలాంటి సమయంలో జీ తెలుగు వారు ఈ సినిమాను దక్కించుకుని మరింతగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
జీ తెలుగు లో చాలా కాలంగా పవన్ సినిమాల స్ట్రీమింగ్ లేదు.దాంతో చాలా కాలం తర్వాత వచ్చిన ఛాన్స్ అవ్వడం తో జీ తెలుగు వారు పవన్ అభిమానుల దృష్టిని ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు.నెట్టింట జరుగుతున్న ఈ ప్రచారంతో నేడు టెలికాస్ట్ కాబోతున్న వకీల్ సాబ్ కు రికార్డు బ్రేకింగ్ రేటింగ్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ మద్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలు కొత్త సినిమాలు అన్ని కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి.కనుక ఈజీగా జీ తెలుగు కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంటుందని అంటున్నారు.
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేథా థామస్ మరియు అనన్య లు కీలక పాత్రల్లో నటించారు.