తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
వి.హెచ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని అన్నారు పవన్ కళ్యాణ్.కాంగ్రెస్ పార్టీలో తాను ఇష్టపడే నేతల్లో వి.హెచ్ ఒకరని పవన్ అన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం సాగించడంలోనూ.ప్రజావాణి బలంగా వినిపించడంలోనూ వి.హెచ్ ప్రత్యెక శైలి అని అన్నారు పవన్ కళ్యాణ్.ఈ ప్రత్యేకతల వల్లే ఆయనంటే తనకు ప్రత్యేక గౌరవమని అన్నారు పవన్.
ఆయనలోని ఈ ప్రత్యేకతల వల్లే రాజకీయ వర్గాల్లోనూ.ప్రజల్లోనూ ఉన్నత స్థానం దక్కించుకున్నారని అన్నారు.సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి వి.హెచ్ పోరాడుతారని అన్నారు.ఆయన అనారోగ్యపాలై ఆసుపతిలో చేరినప్పటి నుండి ఆయన పరిస్థ్తి గురించి అపోలో వర్గాలను అడిగి తెలుసుకుంటున్నా అని అన్నారు పవన్.అప్పుడు కొవిడ్ పరిస్థితులు బలంగా ఉండటం వల్ల ఆయన్ను కలవలేదని.
ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ రావాలని రాజకీయ సేవ చేయాలని జనసేన పార్టీ తరపున మనస్పూర్తిగా కోరుతుంటున్నా అని అన్నారు పవన్ కళ్యాణ్.