తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హోటల్ యజమాని పై దాడికి పాల్పడ్డారు.విషయంలోకి వెళితే తిరుపత్తురు జిల్లా అంభూరు లో భోజనం ఆర్డర్ చేసిన క్రమంలో తమకు సేమియా ఫ్రై ఇవ్వలేదని… గొడవకు దిగారు.
సైరా పార్టీలకు చెందిన కార్యకర్తలు హోటల్ యజమాని పై దారుణంగా దాడికి పాల్పడడంతో.పాటు హోటల్ లో ఉన్న వస్తువులను సైతం పాడు.
చేయడంతో వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ క్రమంలో పోలీసులు హోటల్ లో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయంగా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రెండు పార్టీలపై విమర్శలు వస్తున్నాయి.అంతమాత్రమే కాకుండా గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన టైంలో అధికారంలో ఉన్న ప్రస్తుత డీఎంకే పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టానుసారం జయలలిత క్యాంటీన్ల పై రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో రాజకీయ పార్టీల నాయకులు ఈ రీతిగా.తమిళనాడులో వ్యవహరిస్తూ ఉండటంతో కామన్ ప్రజల నుండి తీవ్ర స్థాయిలో రాజకీయ నేతలపై.వారు వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నాయి.