స్టార్ హీరోయిన్ సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రకు ఒకవైపు ప్రశంసలు వస్తుంటే మరోవైపు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తమిళనాడుకు చెందిన కొందరు సినీ ప్రముఖులు, కొందరు నెటిజన్లు రాజీ పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ లో సమంత అభినయంతో ఆకట్టుకోవడం గమనార్హం. చెన్నైకు చెందిన సమంత ప్రస్తుతం తమిళంతో పోలిస్తే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.
అయితే ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్ర ఈలం ఉద్యమంను కించపరిచే విధంగా ఉందని తమిళనాడుకు చెందిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు. తమిళ రాజకీయ నేతలు, తమిళనాడులోని కొన్ని సంఘాలు ది ఫ్యామిలీ మేన్2 తమిళ ప్రజల యొక్క మనోభావాలకు భంగం కలిగించే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ నటుడు మనోబాలా మాట్లాడుతూ సమంతను దర్శకులు తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.
రాజీ పాత్రలో నటించినందుకు సమంత కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కామెంట్లు చేశారు. సమంతను మోసం చేసి తమిళ తీవ్రవాది అని ఆ పాత్ర గురించి చెప్పి ఉండవచ్చని మనో బాలా అభిప్రాయపడ్డారు.ఒక అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఎల్టీటీఈ గురించి రాయాలని ఆయన పేర్కొన్నారు.
ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ వల్ల తమిళుల మనోభావాలు దెబ్బ తిన్నాయని అందువల్ల దర్శకులు క్షమాపణలు చెప్పాలని మనోబాలా వెల్లడించారు.
తమిళుల మనోభావాలను పరిరక్షించడం కొరకు ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఈ వెబ్ సిరీస్ లో అవాస్తవాలను చూపించినందుకు బాధ్యత వహించాల్సిందేనని మనో బాలా వెల్లడించారు.క్షమాపణలు చెప్పేవరకు వెబ్ సిరీస్ విషయంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని మనో బాలా చెప్పుకొచ్చారు.మరోవైపు సమంత శాకుంతలం సినిమాతో పాటు ఒక తమిళ సినిమాతో బిజీగా ఉన్నారు.