యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా అక్టోబర్ 13 న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 29 2022 న విడుదల చేయనున్నట్టు కూడా అప్పుడే ప్రకటించారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయ్యింది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మైత్రి పోస్ట్ షేర్ చేసింది.ఇందులో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని చెప్పకనే చెప్పింది.మాస్’సివ్ జర్నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని మైత్రి మూవీస్ మేకర్స్ పోస్ట్ చేసింది.దీంతో ఈ సినిమా ఫుల్ గా మాస్ లెవల్లో ఉండబోతుందని చెప్పకనే చెప్పింది.
ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్ కూడా విషెష్ తెలిపారు.
తారక్ విషెష్ చెబుతూ ఈ సినిమాలో జాయిన్ అవ్వడం కోసం తాను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అంటూ పోస్ట్ షేర్ చేసారు.దీంతో ఈ కాంబోపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.