ఏపీ సీఎం జగన్ మీద ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నా వాటిని లెక్కచేయకుండా తనదైనా పాలన అందిస్తూ ప్రజలకు మేలు చేకూరే ఎన్నో పధకాలతో వారి హృదయాలను దోచేస్తున్నాడు.ఒక మంచి పక్కన చెడు ఎప్పుడు మాటేసుకుని కూర్చుంటుందన్న విషయం తెలిసిందే.
అలాగే ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మిమర్శిస్తూ మానసిక ఆనందం పొందే వారు కూడా ఉన్నారు.
ఇకపోతే నేడు విశాఖపట్నంలో 1000 పడకల కరోనా ఆసుపత్రిని ప్రారంభించిన విషయ తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.ప్రధాని మోదీ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ఓ లక్ష్యం ఉన్న నాయకుడు అని, కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తోందని పొగిడారు.
ఇక ఆర్ఎన్ఐఎల్ ఆధ్వర్యంలో వైజాగ్లో 1000 పడకలతో కొవిడ్ ఆస్పత్రి నిర్మించగా, తొలిదశలో 300 పడకలు నేడు అందుబాటులోకి వచ్చాయి.