మనిషి తన మేధస్సుతో ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడటం అసాధ్యమన్న విషయం ప్రతి సారి నిరూపించబడుతుంది.ఇక తాజాగా ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లాలో జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతు అవ్వగా 31 మంది మృతి చెందారు.అయితే ఈ విపత్తుకు గ్లేసియర్ బరస్ట్ కారమని అంతా భావించారు.
కానీ మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది.అదేమంటే.
నందాదేవి శిఖరంపై సుమారుగా 56 ఏళ్ల కిందట పరిశీలనకు వెళ్లిన అధికారుల బృందానికి ఊహించని ప్రమాదం ఎదురవడంతో వారు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైజ్ను అక్కడే వదిలేశారట.
కాగా తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ పరికరం కోసం అధికారులు మరుసటి సంవత్సరం అక్కడికి వెళ్లగా ఈ రేడియో యాక్టివ్ పరికరం మాత్రం కనిపించకుండా పోయిందని ఇక్కడి గ్రామస్థులు తెలుపుతున్నారు.ఇక ఈ ప్రమాదానికి రేడియో యాక్టివ్ డివైజ్ కారణమా లేక మరేదైనా ఇంకో కారణం ఉందా అని మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారట.