కరోనా కారణంగా దేశంలో దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ చాలా కఠినంగా అమలు అయ్యింది.లాక్ డౌన్లోనూ కేసుల సంఖ్య పెరిగిన కారణంగా అన్ లాక్ చేయడం మొదలు పెట్టారు.
అందులో భాగంగానే హోటల్స్ను తెరచుకునే వెసులు బాటు కల్పించారు.ఇప్పటికి థియేటర్లు మరియు కొన్ని మాల్స్కు ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు.
మరో అన్ లాక్ లో భాగంగా ఈసారి థియేటర్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.ఆగస్టు 1 నుండి థియేటర్లు ఓపెన్కు అనుమతులు ఇవ్వనున్నారు అంటూ చాలా బలంగా వాదన వినిపిస్తుంది.
థియేటర్లు ఓపెన్ కాబోతున్నా కూడా సినిమా వారికి పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు.ఈ పరిస్థితుల్లో జనాలు థియేటర్లుకు వస్తారని మేము భావించడం లేదు.సినిమాను విడుదల చేయాలని కూడా అనుకోవడం లేదంటున్నారు.హోటల్స్కు అనుమతులు వచ్చిన సమయంలో సంతోషంగా చాలా హోటల్స్ మరియు రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు.
కాని కస్టమర్లు రాక చాలా హోటల్స్ను మూసి వేశారు.పని వారికి జీతం ఇవ్వడం కూడా భారంగా మారడంతో చాలా మంది రెస్టారెంట్స్ను కనీసం ఓపెన్ కూడా చేయడం లేదు.
కొన్ని పెద్ద హోటల్స్ మరియు రెస్టారెంట్స్ మాత్రం నష్టం వచ్చినా కొనసాగుతున్నాయి.ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తే హోటల్స్కు పట్టే పరిస్థితి పట్టవచ్చు అంటున్నారు.
థియేటర్లు ఓపెన్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు రారు.ఒక వేళ థియేటర్లు ఓపెన్ చేస్తే మెయింటెన్స్ ఖర్చు ప్రారంభం అవుతుంది.ప్రేక్షకులు రాక మెయింటెన్స్ ఖర్చు భరించలేక మళ్లీ నెల రెండు నెలల్లోనే థియేటర్లు మూత పడే అవకాశం ఉంది.అందుకే ముందే కొన్ని థియేటర్లను ఓపెన్ చేయవద్దని భావిస్తున్నారట.
ఆగస్టు 1 తర్వాత మరింతగా లాక్ డౌన్ సడలించే నేపథ్యంలో కేసులు మరెంతగా పెరిగేనో అనే ఆందోళన కూడా జనాల్లో వ్యక్తం అవుతోంది.