సీఎం గారి ఇలాకా లో కరోనా కలకలం రేపింది.ఆయన గారి సెక్యూరిటీ సిబ్బందిలో ఏకంగా ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం కలవరం కలిగించి.
ఈ ఘటన దేశంలో మహారాష్ట్రలో చోటుచేసుకుంది.మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
మహారాష్ట్రలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఇప్పటికే అక్కడ నమోదు ఆయిన కేసుల సంఖ్య ఏకంగా 12 వేలకు పైగానే అని చెప్పాలి.
అలానే మరణాలు కూడా 485 నమోదు కావడం గమనార్హం.
అధికారులు ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నప్పకీ రోజు రోజుకు మహారాష్ట్ర లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.
దేశంలో నమోదు అయిన మొత్తం కేసుల్లో 25 శాతం మహారాష్ట్రలోనే నమోదు కావడం తీవ్ర కలవరం కలిగిస్తుంది.పై గణాంకాలను చూసుకుంటే ఈ కరోనా మహమ్మారి మహారాష్ట్రలో ఎంత తీవ్రంగా ఉందొ అన్న విషయం అర్ధం అవుతుంది.
ఇలాంటి సమయంలో సీఎం గారి సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ తేలడం తో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అక్కడ లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేస్తున్నప్పటికీ అక్కడ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు.
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సెక్యూరిటీ సిబ్బందిలో కూడా ముగ్గురికి కరోనా సోకినట్లు.శనివారం పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైనట్లు తెలుస్తుంది.
వీరు ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని అధికారులు వెల్లడించారు.దీంతో కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.