వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకుని వేల కోట్లకి ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీనిని ఈ రోజు ఊహించని విధంగా లండన్ పోలీసులు అరెస్ట్ చేసారు.భారత దేశంలో మోసాలకి పాల్పడిన నేరంలోనే అతనిని లండన్ లో అరెస్ట్ చేసి కేసు నమోదు పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అయితే అతను బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు.అయితే లండన్ కోర్ట్ అతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
నీరవ్ మోడీ బెయిల్ మంజూరుని తిరష్కరించిన లండన్ కోర్ట్ అతనిని పోలీసుల కస్టడీకి అప్పగించింది.మార్చి 29 వరకు అతనిని పోలీసుల కస్టడీలో ఉంచాలని ఆదేశించింది.అయితే నీరవ్ మోడీ అరెస్ట్ ని ఇప్పుడు బీజేపీ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలంలో ఎన్నికలలో లబ్ది కోసం లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నారని, ఎన్నికలు అవగానే మళ్ళీ అతనిని విడుదల చేసేస్తారని ఆరోపణలు చేస్తుంది.