పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మింగలేక, కక్కలేక అన్న పరిస్థితి అయిపొయింది.పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడిని ప్రతిఘటించలేకపోయిన ప్రభుత్వం బలహీనతని ఆ దేశ మీడియా, ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా ఎత్తి చూపిస్తూ, విమర్శలు చేస్తున్నారు.
భారత్ ఉగ్రవాదులపై తీసుకున్న సైనిక చర్యలతో తీవ్రంగా ఇబ్బందులకి గురైన పాకిస్తాన్ ప్రభుత్వం వైమానిక దాడి అంతా అబద్ధం అని, ఎవరు చనిపోలేదని చెప్పుకొచ్చింది.అయితే పాకిస్తాన్ లోకి భారత్ యుద్ధ విమానాలు ప్రవేశించాయని సన్నాయి నొక్కులు నొక్కుతూ, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇక వైమానిక దాడిని తిప్పి కొట్టకపోతే ప్రపంచ దేశాలలో తమది ఉగ్ర దేశం అని ఒప్పుకోవాల్సి వస్తుందని భావించిన పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ శాఖతో అత్యవసర బేటీ ఏర్పాటు చేసి యుద్ధ సన్నాహాలు మొదలెడుతున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ప్రజలని అప్రమత్తం చేసే అలెర్ట్ సైరన్ మొగిన్చినట్లు తెలుస్తుంది.
మరో వైపు భారత్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ బలగాలు రెచ్చిపోయి కాల్పులకి తెగబడుతున్నారు.దీంతో భారత్ ఆర్మీ కూడా పాకిస్తాన్ కాల్పులని బలంగా తిప్పి కొడుతున్నాయి.
మరి ప్రస్తుత పరిస్థితి చూస్తూ వుంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని వుందని చెప్పాలి.
.