పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉన్నారు.కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మించనున్నారు.
శృతిహాసన్ కథనాయికగా, అనూప్ రుబెన్స్ సంగీత దర్శకుడిగా, రామజోగయ్య శాస్త్రీ పాటల రచయితగా ఎంపికయ్యారు.
ఈ సినిమా కొద్దిగా తమిళ చిత్రం వీరమ్ ని పోలి ఉంటుంది అని కొందరు అంటుంటే, కాదు పూర్తిగా కొత్త కథ అని మరో వాదన వినిపిస్తోంది.
ఇంతకి ఈ కథ పవన్ కళ్యాణ్ రాసినదేనా లేక, డాలికి ముందు ఈ ప్రాజెక్టులో ఉన్న ఎస్ జే సూర్య రాసిందా అనే విషయం బయటికి పూర్తిగా తెలియట్లేదు.మొత్తానికి ఓ ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథ అని ప్రచారం జరుగుతోంది.
అలాగే ఈ సినిమా లైన్ ఇదే అని ఫిలింనగర్ లో ఒక రూమర్ వినబడుతోంది.దాని ప్రకారం, పవన్ కళ్యాణ్ పక ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తారు.
హీరో పాత్రకి లవ్ స్టోరీల మీద ఒకలాంటి భయం/విరక్తి పుడతాయి.దానికి కారణం టీనేజ్ లో అతనికి ఒక లవ్ ఫేల్యూర్ ఉండటం.
అటువంటి మనస్తత్వాన్ని పెట్టుకోని శృతిహాసన్ కనబడగానే మళ్ళీ ప్రేమలో పడిపోతాడు.మరి లవ్ స్టోరీల మీద నెగేటివ్ భావనలు పెంచుకున్న ఒక ఫ్యాక్షన్ లీడర్ తన కొత్త ప్రేమకథ కోసం ఎన్ని పాట్లు పడ్డాడో, ఏం చేసాడు అనేది ఈ చిత్ర కథ అని ఒక రూమర్ వినబడుతోంది.
ఇందులో నిజమెంతో ఇప్పుడే చెప్పడం కష్టం.