బాహుబలి విడుదలైన నాలుగు వారాలకి విడుదలైంది శ్రీమంతుడు.నిజానికి బాహుబలికి, శ్రీమంతుడుకి కేవలం వారం గ్యాప్ మాత్రమే ఉండింది మొదట.
కాని రాజమౌళి అడగ్గానే మహేష్ తన సినిమా వాయిదా వేసుకున్నాడు.ఇక మహేష్ అడగ్గానే శ్రీమంతుడు విడుదల సమయంలో చాలా థియేటర్లు వదిలేసాడు రాజమౌళి.
50 రోజుల సంబరాలు అంటూ, అసలు ఎందుకు పనికిరాని రికార్డుల వెంట పడలేదు జక్కన్న.ఆరకంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకోని, ఇద్దరూ మంచి సక్సెస్ ని సాధించారు.
ఇప్పుడు సరైనోడు విడుదలైన నాలుగు వారాలకి బ్రహ్మోత్సవం విడుదలవుతోంది.సరిపడా థియేటర్లు మహేష్ కి దొరకట్లేదు.
థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లు చేసిన సినిమా దాన్ని రికవర్ చేయాలంటే భారి ఓపెనింగ్స్ రావాలి.కాని అలా సాధ్యపడదు ఈసారి.
50 రోజుల మోజుతో థియేటర్లు బ్లాక్ చేసుకుంటోంది సరైనోడు టీమ్.ప్రతి చిన్న ఏరియాలో గీతా ఆర్ట్స్ అనుబంధిత థియేటర్లు ఉన్నాయి.
వారి మాటే వేదం వాటి యజమానులకు.
రాజమౌళి, మహేష్ మధ్య ఏర్పడిన స్నేహపూరితమైన వాతవరణం మహేష్ – అల్లు అర్జున్ మధ్య ఎందుకు ఏర్పడలేదు.
పక్కవారి సినిమాలు కూడా ఆడాలి అని రాజమౌళికి ఉన్న మంచి ఆలోచన అల్లు అర్జున్ కి లేదా అని ప్రశ్నిస్తున్నారు సినీ విమర్శకులు.