ఆకాశంలో ఎన్ని చుక్కలు తళుక్కుమని మెరుస్తున్నా చంద్రుడు వచ్చాడంటే వాటి తళకులు సన్నగిల్లడం ఖాయం.అలాగే ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న నేతల మీద ఎంతలా బురద చల్లిన అది వారి మీదనే చిల్లుతుంది గానీ నిజమైన నాయకుడికి రవ్వంత మరక కూడా అంటదు.
ప్రస్తుతం ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ మీద ఉన్న అభిప్రాయం ఇదేనటా.
ప్రతిపక్షం టీడీపీలోని నేతలు, చిన్న బాబు, పెద్ద బాబు కలిసి ప్రభుత్వం పరువు తీయాలని కోకిల కూతలు తీస్తున్నా, ఆ కూత కూసేది కోకిల కాదని, కాకి అని అనుకుంటున్నారట జనం.ఎందుకంటే ప్రస్తుతం విశాఖ ఉక్కు విషయంలో లోకేష్ మాటలు కూడా ఇలానే ఉన్నాయట.
ఇకపోతే విశాఖ ఉక్కు దీక్ష నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా నారా లోకేష్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైస్ జగన్, విశాఖ ఉక్కు ని తుక్కుగా మార్చి కార్మికుల ఊపిరి తియ్యాలని కుట్రలు చేస్తుంటే.స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం ఇక్కడి నుండి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి అందిస్తున్నారని, ఇక రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ ఇప్పటికైనా మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడాలని సూచించారు ట్విట్టర్ పిట్టగా పేరుతెచ్చుకున్న నారా లోకేష్.