ఏపీలో ప్రస్తుతం గజపతి రాజు ఎపిసోడ్ నడుస్తోంది.ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలకు ఇప్పటికే క్షత్రియ సామాజిక వర్గం గుర్రుగా ఉంటోంది.
చాలామంది క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆరోపణలపై లేఖలు కూడా రాస్తున్నారు.దీంతో ఇటు వైసీపీలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
అయితే ఎవరేం అనుకున్నా సరే విజయసాయిరెడ్డి మాత్రం అస్సలు వెనక్కు తగ్గట్లేదు.
మరోసారి గజపతిరాజుపై ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు ఎంపీ విజయసాయిరెడ్డి.
గజపతి రాజు గతంలో చేసిన స్త్రీలకు ఆస్తి హక్కు లేదనే వ్యాఖ్యలపై మరోసారి విజయసాయి మాటల బాణాలు ఎక్కుపెట్టారు.మహిళలకు ఆస్తి హక్కు లేదని పూసపాటి రాజ్యాంగంలో లేదని గజపతిరాజు వాదిస్తే భారత చట్టం ఒప్పుకోదని ఎద్దేవా చేశారు.
చట్టానికి లోబడే అన్ని కార్యక్రమాలు ఉండాలని ఇన్డైరెక్టుగా కౌంటర్ దింపారు.ఫ్యామిలీ లాలు పనిచేయవని, రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని గట్టి కౌంటర్ వేశారు విజయసాయిరెడ్డి.
ఇక ఇదే క్రమంలో గజపతి రాజుపై విజయసాయి సంచలన ఆరోపనలు చేశారు.దివంగత మహానేత ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచిన దాంట్లో అశోక్ గజపతి ప్రధాన పాత్ర పోషించారంటూ ఆరోపించారు.ఎన్టీఆర్ను ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెన్నుపోటు పొదవగా.గజపతి రాజు దగ్గరుండి మరీ కత్తి అందించాయరని సంచలన వ్యాఖ్యలు చేశారు.అందుకే ఎన్టీఆర్ పార్టీ నుంచి తరిమేసిన వారిలో బాబు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో అశోక్ గజపతి రాజు ఉన్నాడని ఆరోపించారు.అప్పట్లో రామారావు ఎమ్మెల్యే శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కోరుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర స్పీకర్కు లేఖ రాశారంటూ ధ్వజమెత్తారు.
మొత్తానికి గజపతి రాజుపై విజయసాయి విమర్శలు మాత్రం ఆపట్లేదనే చెప్పాలి.మరి ఈ వ్యాఖ్యలపై గజపతి రాజు ఏమైనా స్పందిస్తారో లేదో అన్నది చూడాలి.