కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.
రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.ఇంకా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.
ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమా వల్ల నీల్ మాత్రమే కాదు ఇందులో నటించిన యష్ కూడా సూపర్ స్టార్ గా ఎదిగాడు.
ఒక్క సినిమాతో ఈయన కన్నడ నాట సంచలనం సృష్టించాడు.రాఖీ బాయ్ గా ఈయన సృష్టించిన వీరంగం గురించి అందరికి తెలుసు.ఇక ఇప్పుడు చాప్టర్ 2 తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.సినిమా రిలీజ్ కు మూడు రోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రొమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్.
ఇప్పటికే ఈ టీమ్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రొమోషనల్ ఈవెంట్ లను నిర్వహించి సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నారు.కెజిఎఫ్ చాప్టర్ 2 చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ద్రుష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది.ఈ రోజు ఉదయం టీమ్ అంతా తిరుమల స్వామి వారిని దర్శించు కున్నారు.ఆ తర్వాత అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ ప్రెస్ మీట్ లో యష్ ను మీడియా కొన్ని ప్రశ్నలు సంధించింది.ఈయనను మల్టీ స్టారర్ సినిమా చేస్తారా అని ప్రశ్న సంధించిన మీడియాకు యష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.యష్ మాట్లాడుతూ.”మల్టీ స్టారర్ అంటే అందుకు తగ్గ కథ, డైరెక్టర్, టెక్నీషియన్స్ ఉండాలి.ముక్యంగా కథ ఊర మాస్ అయి ఉండాలి” అంటూ ఆయన మనసులోని మాటలను బయట పెట్టాడు.అలాగే మీరు ఓన్లీ ఊర మాస్ యాక్షన్ సినిమాలను చేయడానికే ఇష్టపడతారా.
అని ప్రశ్నించగా.మాస్ లోను క్లాస్ ఉంటుంది.
కానీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలి.మూవీ మిర్చిలా ఉండాలి… అలా ఉంటేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
నేనెప్పుడూ అలాంటి సినిమాలు చేయడానికే ఇష్టపడతారు.అని అన్నారు.