అధిక బరువు.ఇటీవల రోజుల్లో కోట్లాది మందికి అతి పెద్ద శత్రువు ఇది.బరువు పెరగడం సులభమే.కానీ పెరిగిన బరువును తగ్గించుకొని శరీరాన్ని చక్కదిద్దుకోవడం చాలా కష్టం.
అయినప్పటికీ ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధతో బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే బరువు తగ్గాలంటే శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించడం ఎంతో అవసరం.
లేదంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గాలనే కల కలగానే మిగిలిపోతుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే శక్తి లభించడమే కాదు బరువు కూడా తగ్గుతారు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? అసలు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న అవిసె గింజలు మరియు నువ్వులను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల ఎండు ద్రాక్షలు, నాలుగు డ్రై ఆప్రికాట్స్, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ కొవ్వు తొలగించిన పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ యాలుకల పొడి వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే వెయిట్ లాస్ డ్రింక్ సిద్ధమైనట్లే.సూపర్ టేస్టీగా ఉండే ఈ డ్రింక్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఈ సూపర్ డ్రింక్ ను రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకుంటే శరీరానికి బోలెడంత ఎనర్జీ లభిస్తుంది.
అదే సమయంలో అధిక బరువు సమస్య నుంచి సైతం త్వరగా బయటపడతారు.