కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ అందుకుంటూ వందల కోట్లను వసూలు చేస్తుంటే.
బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు, దీంతో అక్కడ పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.
మరి అలాంటి పరిస్థితుల నుండి బయట పడాలంటే ఒక్క సినిమా ఒకే ఒక్క హిట్ సినిమా పడాలి.మరి ఈ హిట్ సినిమా కూడా మనదే అవుతుందా? అంటే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అవును అనే అంటున్నారు.ఎందుకంటే పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాను ఇక్కడ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ ప్రోమోట్ చేస్తున్నాడు.
ఇది డైరెక్ట్ హిందీ సినిమా అనేలా వీరి ప్రొమోషన్స్ సాగుతుండడంతో మన తెలుగు ప్రేక్షకులు కంటే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు.అంతేకాదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో కావడంతో ఈయనకు ఉన్న క్రేజ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా మీద మరింత ఇష్టం కలిగేలా చేస్తుంది.మరి నిజంగానే లైగర్ సినిమాతో బాలీవుడ్ లో కొత్త కళ వస్తుందో ఏమో చూడాలి.
ఇది ఇలా ఉండగా.విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
ఈ సినిమా ఆగష్టు 25న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది.మరి హిందీ బెల్ట్ కి లైగర్ సినిమాతో ఉపశమనం లభిస్తుందో లేదో చూడాలి.