తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Director Trivikram Srinivas )… ఆయన చాలా సినిమాలు చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే రీసెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేసిన చాలా సినిమాలు కాపీ అంటూ రూమర్స్ అయితే వస్తున్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నప్పటికీ కాపీ అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి కథనాలు అయితే వస్తున్నాయి.
ఇక ఇప్పుడు మహేష్ బాబు( Mahesh Babu ) తో చేసిన గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) కూడా యద్దనపూడి సులోచన రాణి రాసిన నవల అయిన కీర్తి కిరీటాలు కి కాపీగా వచ్చిందంటూ చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇది ఇలా ఉంటే మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ కథలను కాపీ చేస్తాడు, కేవలం డైలాగ్ లు మాత్రమే బాగా రాసుకుంటాడు అనే అపవాదు కూడా ఆయన మీద ఉంది.అయితే త్రివిక్రమ్ కథను కాపీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే త్రివిక్రమ్ కథల్లో కోర్ ఎమోషన్ అనేది కరెక్ట్ గా పండించలేకపోతాడు అందుకే ఆ ఎమోషన్ ని పట్టుకోడానికి కథలను కాపీ చేస్తూ దానికి కామెడీ ఆడ్ చేసి రాస్తూ ఉంటాడు అని మరికొంత మంది అంటూ ఉంటారు.
ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఒక రైటర్ గా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ ఫుల్ దర్శకుడి గా కూడా మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు… ఇక రైటర్ కూడా ఇండస్ట్రీ లో మంచి డైరెక్టర్ అవ్వచ్చు అని తెలియజేశాడు…ఇక ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఆ తరువాత చాలా మంది రైటర్లు డైరెక్టర్లు గా మారారు…ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి…
.