మణిపూర్ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితులకు కస్టడీ విధించిన కోర్టు..!!

దేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అమానుష ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ఏకంగా ఆడవాళ్లను నగ్నంగా.

ఊరేగించిన ఆ వీడియో తాజాగా బయటపడటం సంచలనంగా మారింది.మణిపూర్ లో రెండు తెగల మధ్య గత కొద్ది నెలల నుంచి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకోవడం తెలిసిందే.

ఈ క్రమంలో ఓ తెగకు చెందిన మహిళలను మరొక తెగ పురుషులు నగ్నంగా ఊరేగించారు.ఆ తర్వాత పంట పొలాల్లోకి లాకెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో నగ్నంగా ఆడవాళ్లను ఊరేగించిన వీడియో.సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చాలామంది ప్రశ్నిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా స్థానిక కోర్టు.నలుగురు నిందితులకు 11 రోజులపాటు కస్టడీ విధించడం జరిగింది.కాగా మే నెలలో ఈ ఘటన జరగగా.

ఇటీవల మణిపూర్ లో ఇంటర్నెట్ ఆంక్షలు తొలగించడంతో తాజాగా బయటపడిన ఈ వీడియో.దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే అత్యాచారానికి గురైన బాధిత యువతి భర్త ఆర్మీలో పనిచేస్తున్నట్లు తేలింది.దీంతో ఈ ఘటన విషయంలో ఆయన చాలా మనోవేదనకు గురయ్యారట.

సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన తమకు ఇలాంటి ఘటన జరగటం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారట.కార్గిల్ లో పోరాడి దేశాన్ని రక్షించినప్పటికీ దేశంలోపాల తన భార్యను కాపాడుకోలేకపోయినట్లు.

ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.కన్నీరు మున్నీరుగా విలపించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube