దేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అమానుష ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ఏకంగా ఆడవాళ్లను నగ్నంగా.
ఊరేగించిన ఆ వీడియో తాజాగా బయటపడటం సంచలనంగా మారింది.మణిపూర్ లో రెండు తెగల మధ్య గత కొద్ది నెలల నుంచి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకోవడం తెలిసిందే.
ఈ క్రమంలో ఓ తెగకు చెందిన మహిళలను మరొక తెగ పురుషులు నగ్నంగా ఊరేగించారు.ఆ తర్వాత పంట పొలాల్లోకి లాకెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో నగ్నంగా ఆడవాళ్లను ఊరేగించిన వీడియో.సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చాలామంది ప్రశ్నిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా స్థానిక కోర్టు.నలుగురు నిందితులకు 11 రోజులపాటు కస్టడీ విధించడం జరిగింది.కాగా మే నెలలో ఈ ఘటన జరగగా.
ఇటీవల మణిపూర్ లో ఇంటర్నెట్ ఆంక్షలు తొలగించడంతో తాజాగా బయటపడిన ఈ వీడియో.దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే అత్యాచారానికి గురైన బాధిత యువతి భర్త ఆర్మీలో పనిచేస్తున్నట్లు తేలింది.దీంతో ఈ ఘటన విషయంలో ఆయన చాలా మనోవేదనకు గురయ్యారట.
సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన తమకు ఇలాంటి ఘటన జరగటం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారట.కార్గిల్ లో పోరాడి దేశాన్ని రక్షించినప్పటికీ దేశంలోపాల తన భార్యను కాపాడుకోలేకపోయినట్లు.
ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.కన్నీరు మున్నీరుగా విలపించారట.