ఏపీలో 11మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ.ఆంధ్రప్రదేశ్ లో 11 మంది డిప్యూటీ కలెక్టర్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీశైలం దేవస్థానం యోగ ఉన్న కె.ఎస్.రామారావు ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయమన్న ప్రభుత్వం నూతన ఈవో గా కడప మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న లవన్నను నియమించారు.పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవోగా మురళి అమలాపురం ఆర్డీవో గా వసంతరాయుడు నియమితులయ్యారు.
ఏపీఎస్సీ సీఎఫ్ సీ కృష్ణాజిల్లా ఈడిగా చంద్రలీల, గురజాల ఆర్డీవోగా పార్ధసారధిని ప్రభుత్వం నియమించింది.పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏ గా వసంతబాబును బదిలీ చేశారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా యు.రంగస్వామి నియమితులయ్యారు.
విశాఖ జాయింట్ కలెక్టర్ ఆసరా గోవిందరావు నర్సీపట్నం ఆర్డీవో గా బదిలీ అయ్యారు.రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఓఎస్డీగా నరసింహులు, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా హెచ్.
వి జయరాం ను ప్రభుత్వం నియమించింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 11 మంది డిప్యూటీ కలెక్టర్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.