హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో సహా బల్దియా ముట్టడికి వచ్చారు కాంట్రాక్టర్లు.దీంతో కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
రూ.వెయ్యి కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు.నో పేమెంట్ నో వర్క్ అంటూ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.