తెలంగాణలో వరంగల్ రాజకీయాలు ఎప్పుడూ చాలా విచిత్రంగానే ఉంటున్నాయి.ఎందుకంటే ఇక్కడ జిల్లాల మార్పు అనేది మొదటి నుంచి చాలా టెన్షన్ పెడుతూనే ఉంది.
ఒక నియోజకవర్గంలో ఉంటూ వేరే జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలే ఎక్కువగా ఉంటున్నారు.భౌగోళికంగా ఒక జిల్లాలో ఉన్నా కూడా దాని నియోజకవర్గ మండలాలు మాత్రం వేరే జిల్లాలో ఉండటం గమనార్హం.
ఇక ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దంపతులకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం గండ్ర జ్యోతి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్గా గండ్ర జ్యోతి కొనసాగుతున్నారు.
అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న శాయంపేట మండలం కాస్తా ఇన్ని రోజులు వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నా కానీ ఇప్పుడు అది కాస్త హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చింది.ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.
అదేంటంటే ఆమె ఇన్ని రోజులు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్గా ఉన్నారు.కాగా ఇప్పుడు దాన్ని వరంగల్ జిల్లాగా మార్చేయడంతో ఆమె మండలం కాస్తా హన్మకొండ జిల్లా కిందికి వచ్చింది.
మరి ఒక జిల్లాలో జడ్పీటీసీగా ఉంటూ వేరే జిల్లాలో జడ్పీ చైర్ పర్సన్గా ఎలా కొనసాగుతారంటూ అంతా ప్రశ్నిస్తున్నారు.కాగా ఇది తమ రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేసేందుకు కొందరు కావాలనే చేశారంటూ గండ్ర అభిమానులు వాపోతున్నారు.ఏదేమైనా ఇప్పుడు దీనిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.ఇక జడ్పీ సీఈవో అయితే ఒక అడుగు ముందుకు వేసి వరంగల్లో పాత పాలకవర్గమే కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
మొత్తానికి గండ్ర దంపతులకు పెద్ద సమస్య వచ్చి పడింది.చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది.