ద్రాక్ష పండ్లను ఎండబెట్టి కిస్ మిస్ తయారుచేస్తారు.మనం చాలా రకాల స్వీట్స్ లో కిస్ మిస్ ను వేసుకుంటూ ఉంటాం.
కిస్ మిస్ వేయటం వలన ఆ వంటలకు మంచి రుచి వస్తుంది.అయితే కిస్ మిస్ ని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.
నానబెట్టిన కిస్ మిస్ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రతి రోజు నానబెట్టిన కిస్ మిస్ పండ్లను పరగడుపున తినటం వలన శరీరానికి శక్తి లభించి రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఎంత పని చేసిన అలసట అనేది రాదు.
నానబెట్టిన కిస్మిస్ పండ్లను రోజూ తింటుంటే జీర్ణశక్తి బాగా పెరిగి మలబద్దక సమస్య దూరం అవుతుంది.
గొంతు వ్యాధితో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.ఎందుకంటే ద్రాక్ష శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించటంలో బాగా సహాయపడుతుంది.
నానబెట్టిన కిస్మిస్ పండ్లను రోజూ తింటే రక్తం శుభ్రపడటమే కాకుండా రక్తం కూడా బాగా పెరుగుతుంది.దాంతో రక్తహీనత సమస్య రాదు.అలాగే కండరాలకు కూడా బలాన్ని ఇస్తుంది.
మహిళలు ప్రతిరోజూ కిస్మిస్ పండ్లు తినడం వల్ల మూత్రాశయంలో అమ్మోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.