తెలుగులో 2017వ సంవత్సరం లో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మరియు బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్ జంటగా నటించిన “ప్రేమతో మీ కార్తీక్” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ చిత్రంలో నటించిన తర్వాత కార్తికేయ సినీ అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి సిమ్రత్ కౌర్ మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోలేక పోయింది.
అయితే అవకాశాలు లేక ఖాళీగా గడుపుతున్న సమయంలో ఎట్టకేలకు “పరిచయం” అనే చిన్న బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.దీంతో ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి తన మకాం ను ముంబైకి మార్చింది.
అయితే అక్కడ కూడా ప్రస్తుతం సినీ అవకాశాలు లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.
అంతేగాక పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడప్పుడు తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తోంది.తాజాగా సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.
ఇందులో భాగంగా ఓ నెటిజన్ “మళ్లీ మీరు తెలుగులో ఎప్పుడు నటిస్తున్నారని” అంటూ ప్రశ్నించాడు.దీంతో సిమ్రత్ కౌర్ సమాధానం చెబుతూ “తన చేతిలో టాలీవుడ్ కి సంబంధించిన ఎటువంటి అవకాశాలు లేవని తన పాత్రకి ప్రాధాన్యత కలిగిన అటువంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని” చెప్పుకొచ్చింది.
చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, టాలెంట్ ఉన్నటువంటి సిమ్రత్ కౌర్ తెలుగులో నటించింది రెండు చిత్రాలే అయినప్పటికీ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.అయితే తాజా సమాచారం ప్రకారం సిమ్రత్ కౌర్ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ తో ఓ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.