టాలీవుడ్ ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ హిట్లలో మగధీర సినిమా( Magadheera ) ఒకటి కాగా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.మగధీర సినిమాలో కొన్ని నిమిషాల పాటు చిరంజీవి నటించారనే సంగతి తెలిసిందే.
చిరంజీవి డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కొన్ని షాట్స్ ను ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీనుతో తీశారు.ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రతిరోజూ టిఫిన్ సెంటర్ కు వెళ్లి ఫ్రెండ్స్ అంతా అన్ లిమిటెడ్ టిఫిన్ తినేవాళ్లమని ఆయన పేర్కొన్నారు.తాను మగధీర సినిమాలో చిరంజీవి గారికి డూప్ గా చేశానని ప్రభాస్ శ్రీను( Prabhas Sreenu ) వెల్లడించారు.చిరంజీవి గారికి డూప్ గా చేయడం అంటే ఇంకా పెద్ద అదృష్టం అని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.అప్పట్లో ప్రభాస్ గారింట్లో రాత్రి 3 గంటల వరకు వాలీబాల్ ఆడేవాళ్లమని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో రాజమౌళి( Rajamouli ) నుంచి ఫోన్ కాల్ వచ్చి సినిమాలో ఆఫర్ ఇచ్చారని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.ఆ సినిమాలో నా డ్రెస్, చిరంజీవి గారు వేసుకున్న డ్రెస్ ఒకటేనని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.చిరంజీవి గారు వస్తుంటే నేను పారిపోయేవాడినని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.ఆ డ్రెస్ ను అలానే ఉంచుకోవాలని అనుకున్నానని ఆయన తెలిపారు.అయితే ఆ డ్రెస్ దొరకలేదని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.ప్రభాస్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శ్రీను చేశారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.ప్రభాస్ శ్రీను కమెడియన్ గా ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ప్రభాస్ శ్రీను రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.